భర్త ఇంట్లో.. భార్య బాత్ రూమ్ లో.. పక్కనే గొయ్యి తీసి

by  |
భర్త ఇంట్లో.. భార్య బాత్ రూమ్ లో.. పక్కనే గొయ్యి తీసి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వలన మానవ సంబంధాలు మరుగున పడిపోతున్నాయి. కరోనా సోకినవారు కన్నవారైన, కట్టుకొన్నవారైన సరే బయటికి గెంటేస్తున్నారు. తాజాగా భార్యకు కరోనా సోకిందని ఆమెను బాత్ రూమ్ లో ఉంచాడో ఓ భర్త. ఇంట్లోకి వస్తే తనకెక్కడ కరోనా వస్తుందేమో అని భయపడి ఇంట్లో సరిపడా గదులు ఉన్నా ఆమెను బాత్ రూమ్ లోనే ఉంచాడు. ఈ అమానుష ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగుచూసింది.

లక్సెట్టిపేట గోదావరి రోడ్, గోపాలవాడలో మేడి పెద్దయ్య అనే వ్యక్తి భార్య మేడి నర్సమ్మ తో కలిసి నివాసముంటున్నాడు. అయితే గత ఐదు రోజుల క్రితం నర్శమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను భర్త పెద్దయ్య ఇంటి బాత్ రూమ్ లో ఉంచాడు. ఇంట్లో సరిపడా గదులు ఉన్నా తనకెక్కడ కరోనా సోకుతుందనే భయంతో భార్యను బాత్ రూమ్ కే పరిమితం చేసాడు. అంతేకాకుండా ఇంట్లో ఉండే మరుగుదొడ్డిని కూడా వాడుకోవద్దని పక్కనే ఒక గొయ్యి తీసి అందులో కాలకృత్యాలు తీర్చుకోమని శాసించాడు. దీంతో చేసేదేమి లేక భార్య నర్సమ్మ బాత్ రూమ్ లోనే ఉంటుంది.

ఇక రెండు రోజుల నుండి ఆ ఇంటి నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల స్థానికులు ఏంటా అని ఆరా తీస్తే విషయం బయటపడింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నర్సమ్మ ను బాత్ రూమ్ చెర నుండి విడిపించారు. కరోనా తగ్గేవరకూ ఐసోలేషన్ లో ఉండడానికి నర్సమ్మ ఒప్పుకోకపోవడంతో భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంట్లోనే ఓ గదిలో ఉంచడానికి పోలీసులు ఒప్పించారు.

Next Story

Most Viewed