కట్నం తేలేదని భార్యను ఆ భర్త ఏం చేశాడంటే..?

by  |
కట్నం తేలేదని భార్యను ఆ భర్త ఏం చేశాడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది సారిక.. భర్త ప్రేమ, అత్తమామల ఆదరణ తో జీవితాంతం సంతోషంగా ఉండాలని కలలు కన్నది. కానీ ఆ కలలు కల్లలు గానే మిగిలిపోయాయి. పెళ్లై ముచ్చటగా మూడు నెలలు తిరగకముందే భర్త చేతిలో హతమైంది. వరకట్నం కోసం కట్టుకున్న భార్యను కాల్చి చంపాడో కసాయి భర్త. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

ముజఫర్ నగర్ జిల్లాలోని బుధానా తహసీల్‌ ఉపవాలి గ్రామానికి చెందిన సారికా (24)కు కుల్దీప్ తో గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే సారిక తల్లిదండ్రులు అనుకున్న కట్నం ముట్టచెప్పారు. అయితే వారిచ్చిన కట్నం కుల్దీప్ కి నచ్చలేదు. అయినా సరే తల్లిదండ్రుల బలవంతంపై సారిక మెడలో తాళికట్టాడు. వివాహం జరిగిన తర్వాత మూడు నెలల వరకు భార్యతో సక్యతగానే ఉన్న కుల్దీప్ ఆ తర్వాత వరకట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. పుట్టింటికి వెళ్లి రూ. 50 లక్షలు తీసుకురావాలని సారికను వేధిస్తుండేవాడు. ఈ విషయమై పలుమార్లు భార్యపై దాడికి కూడా పాల్పడ్డాడు.

ఇక ఈ నేపథ్యంలోనే మంగళవారం భార్యతో గొడవపడి తన లాకర్ లో ఉన్న తుపాకిని తీసుకొని భార్యపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్చడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. అనంతరం కుల్దీప్, అతని తండ్రి అక్కడినుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed