దారుణం: ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని.. బావిలోకి తోసి.. రాళ్లతో కొట్టి

by  |
దారుణం: ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని.. బావిలోకి తోసి.. రాళ్లతో కొట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో ఆడపిల్ల పుట్టడమే పాపంగా మారుతున్న రోజులు పోతున్నాయి. ఆడ,మగ సమానమే అంటూ.. లేదు ఇంకా మగపిల్లాడు కన్నా ఆడపిల్లే మాకు ముద్దు అని చెప్పే తల్లిదండ్రులు ఎక్కువగా ఉంటున్నారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆడపిల్ల అంటే దరిద్రమని, ఆడపిల్ల పుడితే చంపేసే కసాయి తండ్రులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా మరోసారి ఆడపిల్లకు జన్మనిచ్చిందని భార్యను, ఇద్దరు కూతుళ్లతో సహా బావిలోకి నెట్టాడు ఓ కసాయి భర్త.. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్ పూర్ సమీపంలోని పడోయ్ గ్రామంలో రాజు భాయ్ యాదవ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మొదటి కాన్పులో భార్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే ఆడపిల్ల అంటే నచ్చని రాజు భాయ్ కూతురుతో ప్రేమగా ఉండేవాడు కాదు. ఇక ఈ నేపథ్యంలోనే మూడు నెలల క్రితం భార్య రెండవ కాన్పులో కూడా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవల అత్తమామల ఇంటివద్ద నుండి భార్యను, పిల్లలను తీసుకువస్తూ పడోయ్ గ్రామంలోని బావి వద్ద మోటారు సైకిలు ఆపాడు.

తన భార్య వరుసగా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కోపంతో రాజాయాదవ్ భార్య, ఇద్దరు ఆడపిల్లలను బావిలోకి నెట్టాడు. అంతేకాకుండా ఆమె పైకి రావడానికి ప్రయత్నిస్తుండగా ఆమెపై పై నుండి రాళ్లతో దాడి చేసి పరారయ్యాడు. ఇక ఈ ఘటనలో పెద్ద కూతురు మృతిచెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక వాహనదారుల సాయంతో పైకి వచ్చిన భార్య, భర్త రాజు భాయ్ యాదవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాజు భాయ్ యాదవ్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Next Story

Most Viewed