భార్య మర్డర్‌కు భర్త సుపారీ

by  |
భార్య మర్డర్‌కు భర్త సుపారీ
X

దిశ, వెబ్‌డెస్క్: భర్తలో సగం భార్య… భార్యలో సగం భర్త… అన్న పెద్దల మాటకు ఓ దుర్మార్గుడు విలువ లేకుండా చేశాడు. తనతో కలిసి ఏడు అడుగులు వేసిన భార్యను ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. కంటికి భార్య కనిపించకుండా తాను ఎవరి కంట పడకుండా పక్కాగా ప్లాన్ గీశాడు. చేయికి మరక అంటకుండా మనువాడిన భార్యను మర్డర్‌కు స్కెచ్ గీశాడు. అందుకు ఇద్దరు మనుషులను మాట్లాడి లక్షల్లో ఆఫర్ చేశాడు. ముందుగా కొంత ముట్టజెప్పి భార్య అడ్రస్‌ చెప్పాక అనామకుడిగా తిరగడం మొదలు పెట్టాడు. ఇంతలో భర్త కుట్రను పసిగట్టిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం మొత్తం బయట పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన అశోక్, రజిత దంపతులు. రజిత.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే క్రమంలో కోపం పెంచుకున్న భర్త అశోక్‌.. భార్యను అంతమొందించేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందుకు ఖమ్మం జిల్లా నెలకొండపల్లికి చెందిన భూక్య వీరబాబు, కొత్తూరి ప్రసాద్‌కు రూ.3లక్షల సుపారీ ఇచ్చి రజితను మర్డర్ చేయాలని చెప్పాడు. ఈ క్రమంలోనే వీరబాబు, ప్రసాద్ రెక్కీ నిర్వహిస్తుండగా పసిగట్టిన రజిత.. ఇల్లందు సీఐకి కంప్లెంట్ చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Next Story

Most Viewed