భార్య గొంతు కోసి.. కత్తితో కడుపులో పొడిచి..

by  |
భార్య గొంతు కోసి.. కత్తితో కడుపులో పొడిచి..
X

దిశ, వెబ్ డెస్క్ : సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేటకు చెందిన రాజు అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం చిన్నకొడూర్‌కు చెందిన లలితను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగింది.

కొద్దిరోజులుగా లలిత ప్రవర్తనలో మార్పు రావడంతో.. రాజు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఈరోజు భార్య, భర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో లలితపై దాడి చేసి.. ఆమె గొంతు కోసి, కడుపులో పొడిచాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు లలితను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రాజు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయడు. వివాహేతర సంబంధం అనుమానం కారణంగానే రాజు.. లలితపై దాడి చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed