ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే భర్త హత్య, భార్య ఆత్మహత్య

by  |
murder
X

దిశ, వెబ్ డెస్క్ : పెద్ద వాళ్ళను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ దంపతుల కాపురం కొన్ని రోజులు సజావుగానే సాగింది. కానీ.. కొన్ని రోజులుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో తరుచు గొడవలు జరిగేవి. ప్రకాశం జిల్లా ఒంగోలు సీతారామపురానికి చెందిన కభాలి నాగరాజు, శ్రీవల్లి లు మూడేళ్ళ క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగరాజు ఆటో డ్రైవర్ గా, శ్రీవల్లి ఓ వస్త్ర దుకాణంలో పనిచేసేవారు. అయితే ఈ మధ్య వారికీ తరుచు గొడవలు జరగడంతో వేరు వేరుగా ఉంటున్నారు. నాగరాజు వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండగా, శ్రీవల్లి మాత్రం సంజీవ్ గాంధీ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ షాపులో పనికి వెళ్తోంది.

మంగళవారం ఉదయం జూళ్లపాలెం తిరునాళ్ళకు వెళ్తున్నా అని వెళ్లిన నాగరాజు బుధవారం మర్లపాడు సమీపంలో ఉన్న ఇనగలేరు వాగులో శవమై కనిపించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై గాయాలు ఉండడంతో.. ఎక్కడో హత్య చేసి వాగులో పడేసుంటారని ఓ నిర్దారణకు వచ్చారు. ఈ కేసులో శ్రీవల్లి ని విచారించాలని తీసుకెళ్తుంటే.. “పర్సు మరిచి పోయానని ఇంట్లోకి వెళ్లి తీసుకొస్తా”నని వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో ఆమె తల్లి, సోదరిని పంపి చూడమనగా వాళ్ళు ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న శ్రీవల్లిని చూసి కేకలు వేశారు. వారి అరుపులు విని లోపలికి వెళ్లిన పోలీసు సైతం షాక్ కు గురమయ్యారు. వెంటనే ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు పేర్కొన్నారు. నాగరాజు హత్య, శ్రీవల్లి ఆత్మహత్య ల వెనుక వివాహేతర సంబంధం దాగిఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed