పండగ పూట చికెన్ వండలేదని…

by  |
పండగ పూట చికెన్ వండలేదని…
X

దిశ, వెబ్‌డెస్క్: పండగ పూట చికెన్ వండలేదని భార్యను హత్య చేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం క్యాంపురాయవరం గ్రామంలో సన్నయ్య, సీతమ్మ దంపతులు. సన్నయ్య మద్యానికి బానిసగా మారి ప్రతిరోజు భార్యను వేధిస్తున్నాడు. ఇదేక్రమంలో దసరా పండగరోజు మద్యం తాగి వచ్చిన సన్నయ్య.. భార్యను చికెన్ కర్రీ వండాలని చెప్పడంతో… తన వద్ద పైసలు లేవని ఆమె వండలేదు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన సన్నయ్య భార్యను కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా… మంగళవారం అసలు విషయం బయట పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story