భార్య గొంతుకోసి చంపిన భర్త

by  |
భార్య గొంతుకోసి చంపిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో గొంతుకోసి భర్త హత్య చేసిన సంఘటన హైదరాబాద్ దుండగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక బీదర్‌కు చెందిన విశ్వనాథ్, పూల్‌బాయి దంపతులు కొన్నేళ్ల క్రితం నుంచి సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, కుమార్తె కాశీబాయి సంతానం. రెండేళ్ల క్రితం కూతురుకు మహారాష్ట్రకు చెందిన మాధవ్‌తో వివాహం జరిపించగా వారు పుణెలో నివాసం ఉన్నారు. ఇటీవల లాక్‌డౌన్ సమయంలో మాధవ్ తన భార్యను పుణె నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి వదిలి వెళ్లి తిరిగి ఈనెల 22న అత్తగారింటికి వచ్చాడు. ఆదివారం కాశీబాయి కుటుంబ సభ్యులు పనులకు వెళ్లగా మాధవ్, కాశీబాయి ఇంట్లో ఉన్నారు.

రాత్రి 10.30సమయంలో కుటుంబ సభ్యులు ఇంటికి రాగా తలుపులు వేసి ఉండటంతో పగలగొట్టి చూడగా కిచెన్‌లో కాశీబాయి రక్తపు మడుగులో చనిపోయి ఉంది. వెంటనే సమాచారం అందించగా మాధవ్ ఫోన్‌ను ట్యాప్ చేసిన పోలీసులు… అతడు కర్ణాటక సమీపంలోని బీదర్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకొని విచారించగా.. తాను బయటకు వెళ్లి వచ్చిన సమయంలో కాశీబాయి మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం వల్లే చంపినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed