తండ్రి దుశ్చర్య.. అనాథలుగా మారిన పిల్లలు

by  |
తండ్రి దుశ్చర్య.. అనాథలుగా మారిన పిల్లలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కట్టుకున్న భార్యను కడతేర్చడంతో పాటు తానూ ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి ప్రాజెక్ట్ వీధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాసులు(30), మంజుల(26) దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అంతా సవ్యంగానే ఉందనుకున్న వీరి దాంపత్య జీవితంలో ఏమైందో తెలియదు గానీ కట్టుకున్న భర్తే తన జీవిత భాగస్వామిని కడతేడ్చాడు.

అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పిల్లలిద్దరూ అనాథలుగా మిగిలారు.అయితే, ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story