- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కోరుట్ల : వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొంతకాలం బాగానే సాగిన వీరి సంసారం ఒక్కసారిగా చెదిరిపోయింది. భార్యపై కలిగిన అనుమానం కాస్త పెనుభూతంలా మారింది. ఇంకేముంది ఓ రోజు భార్యను చితకొట్టాడు భర్త. తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల యకిన్పూర్లో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. యకిన్ పూర్కు చెందిన మనోజ్, కోరుట్లకు చెందిన రుచిత ఏడాది కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరి దాంపత్య జీవితం కొంతకాలం బాగానే సాగినా మనోజ్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మే 30వ తేదీన ఆమెను తీవ్రంగా కొట్టాడు. కరీంనగర్లో ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స పొందిన ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది.విషయం తెలుసుకున్న మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు భర్త మనోజ్పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు.