నిద్రిస్తున్న భార్యపై అమానుషం…

by  |
నిద్రిస్తున్న భార్యపై అమానుషం…
X

దిశ, వెబ్ డెస్క్ : వేదమంత్రాల నడుమ తాళికట్టిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. విచక్షణ మరిచి కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ విషాద సంఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో చోటుచేసుకుంది. భర్త మధుబాబు (35) నిద్రిస్తున్న తన భార్య మాధవి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనుకూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి మాధవిని ఉయ్యూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ ఎసీపీ వర్మ, సలహా సీఐ నాగ ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


Next Story

Most Viewed