తాగొద్దంటవా అని భార్యను చంపిన భర్త

by  |
తాగొద్దంటవా అని భార్యను చంపిన భర్త
X

దిశ ప్రతినిధి, వరంగల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి రోకలితో మోది భార్యను హత్య చేసిన ఘటన జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని రేగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగ సాయిలు అనే వ్యక్తి తాగుడుకు బానిసై నిత్యం భార్య యాదమ్మ (40) ను వేధిస్తున్నాడు. రాత్రి తాగిన మైకంలో భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమె నిద్రిస్తున్న సమయంలో రోకలితో తలపై మోది హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. మృతురాలికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు.



Next Story

Most Viewed