భార్యతో గొడవ పడి చెట్టుకు ఉరేసుకున్నాడు..!

by  |
couple suicide
X

దిశ, బోధన్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెంజల్ మండలం దూపల్లిలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన శంకర్(28).. లలిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరూ ఆడపిల్లలే. తరచూ భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి ఈ నేపథ్యంలోనే బుధవారం భార్యతో గొడవపడిన శంకర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు గ్రామ శివారులో గాలింపు చేపట్టగా ఓ చెట్టుకు ఉరివేసుకొని విగతాజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed