భార్యతో గొడవ.. పెండ్లయిన 6 నెలలకే భర్త ఆత్మహత్య

by  |
భార్యతో గొడవ.. పెండ్లయిన 6 నెలలకే భర్త ఆత్మహత్య
X

దిశ, కామారెడ్డి రూరల్: వివాహం జరిగిన 6 నెలలకే మనస్పర్థలు నెలకొనడంతో.. భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన ఆరేటి చంద్రశేఖర్ చారి (27) అనే యువకునికి భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన లాస్యతో 6 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే వృత్తిరీత్యా దేవుని పల్లి గ్రామంలో నివాసముంటూ కాపురం కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో సోమవారం భార్యతో చంద్రశేఖర్ చారి గొడవపడి ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed