- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, క్రైమ్ బ్యూరో : కట్టుకున్న భార్యను చంపి, భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుబ్బారావు, సాయిలక్ష్మీ దంపతులు యూసుఫ్ గూడ రహమత్ నగర్లో నివసిస్తున్నారు. గత కొంత కాలంగా బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతంతో బాధపడుతున్న సాయిలక్ష్మీని భర్త సుబ్బారావు గురువారం సాయంత్రం పంజాగుట్ట స్వరాగ్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న కూకట్ పల్లిలో నివసించే కుమార్తె అదేరోజు రాత్రి 7.30 సమయంలో వచ్చి చూసి వెళ్లారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది కుమార్తెకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే పరీక్షించిన వైద్యలు భార్య సాయిలక్ష్మీ మరణించినట్టు నిర్థారించారు. సుబ్బారావు అపస్మారక స్థితిలో ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ సుబ్బారావు కూడా మరణించాడు. ఇదిలా ఉండగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్న కారణంగానే అనారోగ్యంతో ఉన్న భార్యను చంపి, భర్త సుబ్బారావు విషం తీసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఉన్నందునే మరణిస్తున్నట్టు సూసైడ్ నోట్ లభించింది. కుమార్తె ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.