దారుణం.. అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

by  |
chennur
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై మంత్రాలు చేస్తుందన్న అనుమానంతో గురువారం కట్టుకున్న భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాతం లింగయ్యకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. ఈ క్రమంలో తన భార్య తనపై క్షుద్రపూజలు, మంత్రాలు చేస్తుందనే అనుమానం కలిగింది. దీంతో, ఇంట్లో నిద్రిస్తున్న భార్య లక్ష్మిని గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం లింగయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ నేపథ్యంలో మృతురాలు పెద్దకొడుకు వేణుగోపాల్ ఫిర్యాదుపై ఎస్ఐ గంగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed