- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై మంత్రాలు చేస్తుందన్న అనుమానంతో గురువారం కట్టుకున్న భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాతం లింగయ్యకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. ఈ క్రమంలో తన భార్య తనపై క్షుద్రపూజలు, మంత్రాలు చేస్తుందనే అనుమానం కలిగింది. దీంతో, ఇంట్లో నిద్రిస్తున్న భార్య లక్ష్మిని గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం లింగయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ నేపథ్యంలో మృతురాలు పెద్దకొడుకు వేణుగోపాల్ ఫిర్యాదుపై ఎస్ఐ గంగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story