- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. తన ఇష్టాఇష్టాలను పట్టించుకోకుండా మానసికంగా, శారీరకంగా స్త్రీ పడే బాధను ఎవరూ అర్థం చేసుకోరు. ఇలా ఎంతో మంది స్త్రీలు గృహహింసకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ భర్త భార్యపై ప్రవర్తించిన తీరు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న మహిళ జీవితం ఓ రాక్షసుడి చేతిలో పడినట్టైంది.
వివరాల్లోకి వెళ్లితే.. నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన ఓ మహిళ రహమత్ నగర్కు చెందిన ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా సాగుతోందన్న వీరి జీవితం అనుకోకుండా మలుపు తిరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ మహిళకు వేధింపులు మొదలయ్యాయి. అత్తమామ, భర్త నుంచి రోజు ఏదోరకంగా హింసించేవారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కట్నం తేవాలంటూ అత్తింట్లో అందరూ వేధింపులకు గురి చేయడంతో లక్షా యాభై వేలను తీసుకువచ్చి ఇచ్చింది. అయినా వేధింపులు తప్పకపోగా భర్త శాడిస్ట్లా ప్రవర్తించడం మొదలు పెట్టాడని వాపోయింది. శారీరకంగా హింసించడం..అర్థ నగ్నంగా కూర్చోవాలని..మూత్రం తాగాలని సైకోలా ప్రవర్తించడంతో విసిగిపోయిన మహిళ చివరికి పోలీసులను ఆశ్రయించింది. అంతే కాకుండా పెళ్లి తరవాత ఆమె గర్భం దాల్చగా అత్తింటివారు ఆపరేషన్ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది.