నీకు ఇంకొకడు కావాలా.. భార్య గొంతుకోసిన భర్త

by  |
నీకు ఇంకొకడు కావాలా.. భార్య గొంతుకోసిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: అనుమానం పెనుభూతమైతే జరిగే అనర్ధాలు ఊహించలేము.. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో గొంతుకోశాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాళ్లోకి వెళితే… ఒడిశాకు చెందిన రీతూ- కృపన్ దంపతులు. బతుకుదెరువు కోసం గుంటూరుకు వలస వచ్చారు. ఈ క్రమంలోనే ఓ క్వారీలో వలస కూలీలుగా పనిచేస్తూ యడ్లపాడు మండలం బోయపాలెంలో నివాసం ఉంటున్నారు.

ఇటీవల భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్య ఎవరితోనే వివాహేతర సంబంధం సాగిస్తుందన్న అనుమానంతో భర్త గొడవకు దిగేవాడు. ఇదే వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారడంతో.. ఆదివారం ఓ బ్లేడ్‌తో ఆమె గొంతు కోశాడు. దీంతో ప్రాణ భయంతో బయటకు పరుగులు తీసిన బాధితురాలిని చూసి స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే నిందితుడిని పట్టుకొని చితక్కొట్టి స్తంభానికి కట్టేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. భర్త దాడిలో స్వల్పంగా గాయపడ్డ బాధితురాలిని పోలీసులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



Next Story

Most Viewed