అనుమానం పెనుభూతమై.. భార్యపై కత్తితో దాడి

by  |
అనుమానం పెనుభూతమై.. భార్యపై కత్తితో దాడి
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాహమై ఆరునెలలే అయ్యింది. సాఫీగా సాగుతున్న సంసారంలో అనుమానం పెనుభూతంగా మారింది. దీంతో దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. రోజూ లాగే నిన్న కూడా గొడవ తలెత్తడంతో విచక్షణ కోల్పోయిన భర్త భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన వెంకటేష్ అనే యువకుడికి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఏకసిరి గ్రామానికి చెందిన దుర్గ (18)తో 6నెలల కిందట వివాహమైంది. అయితే, గత నాలుగు నెలలుగా అమ్మాయి ఇంటి దగ్గరే నవదంపతులు కాపురం ఉన్నారు.రెండు నెలల కిందటే శ్రీ కాళహస్తికి వచ్చి కాపురం పెట్టారు. ఈ క్రమంలోనే వెంకటేశ్ తన భార్యపై అనుమానపడుతూ వచ్చాడు. ఈ విషయంలో ఆలుమగలిద్దరికీ గొడవలు మొదలయ్యాయి. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేశ్ భార్యపై విచక్షణా రహితంగా భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

తీవ్రగాయాల పాలైన ఆమెను వెంటనే శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా, అంతకుముందు జరిగిన పెద్దలు పంచాయితీలో రూ.1.50 లక్షలు ఇస్తే దుర్గను వదిలేస్తానని వెంకటేష్‌ చెప్పినట్లు దుర్గ బంధువులు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed