గచ్చిబౌలికి వెళుతున్న దంపతులు.. మార్గమధ్యలో విషాదం

by  |
గచ్చిబౌలికి వెళుతున్న దంపతులు.. మార్గమధ్యలో విషాదం
X

దిశ‌, గండిపేట్: మద్యం మత్తులో మందు బాబు ర్యాష్ డ్రైవింగ్ భార్యాభర్తల ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట్‌కు చెందిన దుర్గం రాజు (37), దుర్గం మౌనిక(28) భార్యాభర్తలు. సోమవారం ఇద్దరూ కలిసి యాక్టివాపై గచ్చిబౌలికి వెళ్తున్నారు. ఇదే సమయంలో అటుగా కారులో వచ్చిన సంజీవ బైక్‌ను ఢీ కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. యాక్సిడెంట్‌కు కారణమైన సంజీవను అదుపులోకి తీసుకున్న పోలీసులు మందు తాగినట్టు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed