గోవా నుంచి క్రికెట్ బెట్టింగ్.. భార్యభర్తలు అరెస్టు!

by  |
గోవా నుంచి క్రికెట్ బెట్టింగ్.. భార్యభర్తలు అరెస్టు!
X

దిశ, వెబ్‌‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో బెట్టింగ్ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే, తాము ఎక్కడ దొరికిపోతామేమో అని భయంతో ముందుగానే గోవాకు వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో దంపతులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed