మంచి కోసం వెళితే చెడయ్యింది.. కళ్లెదుటే భర్తను కోల్పోయిన భార్య..!

by  |
మంచి కోసం వెళితే చెడయ్యింది.. కళ్లెదుటే భర్తను కోల్పోయిన భార్య..!
X

దిశ, ఖమ్మం రూరల్​ : మంచి కోసం వెళితే ఆ కుటుంబానికి చెడు జరిగింది. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కళ్లెదుటే భర్త చనిపోవడంతో వివాహిత రోదనలు మిన్నంటాయి.

వివరాల్లోకివెళితే.. ఖమ్మం నగరంలోని 1వ డివిజన్​కార్పొరేటర్​తేజావత్ హుస్సేన్​కుమారుడు వీరేంద్రబాబు (35) కోడలు ధనలక్ష్మి, మనుమరాలు కలిసి నేలకొండపల్లి మండలం మంగాపుర తండాలో ఓ ఫంక్షన్‌కు ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోని వరంగల్​క్రాస్ రోడ్డు దాటిన తరువాత ఫుల్లుగా మద్యం సేవించి టాటా ఏస్ ట్రాలీని వేగంగా నడుపుతూ వచ్చిన డ్రైవర్ ముందు వెళ్తున్న టూ వీలర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఆటో వీరేంద్రబాబు మీద నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య ధనలక్ష్మి, కుమార్తెలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

కళ్లెదుటే భర్త దుర్మరణం చెందడంతో భార్య ధనలక్ష్మి రోదన వాహనదారులను, పాదచారులను కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంలో మృతుడి భార్య, కుమార్తె చిన్నగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పిటల్‌కు తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జక్కల శంకర్​రావు తెలిపారు.


Next Story