నిబంధనలు బేఖాతరు.. వందల సంఖ్యలో మహిళల కలశ యాత్ర

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా వ్యాప్తి జరుగుతున్నా ప్రజలు కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజాగా ఒడిశాలోని గంజాం జిల్లా శేరగడా మండలం కృష్ణచాయి గ్రామంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు, లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారు. లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికి వారు పట్టించుకోలేదు. మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కలశ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మహిళలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు [&hellip;]</p>

నిబంధనలు బేఖాతరు.. వందల సంఖ్యలో మహిళల కలశ యాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా వ్యాప్తి జరుగుతున్నా ప్రజలు కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజాగా ఒడిశాలోని గంజాం జిల్లా శేరగడా మండలం కృష్ణచాయి గ్రామంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు, లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారు. లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికి వారు పట్టించుకోలేదు. మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కలశ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మహిళలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో వెంటనే 144 సెక్షన్ విధించారు.

Next Story