మానవత్వం చాటిన పోలీసులు..!

by  |
మానవత్వం చాటిన పోలీసులు..!
X

దిశ, మహబూబాబాద్ : పోలీసులు అంటే ప్రజల్లో ఉన్న అపోహలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమం పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది. వీటితోపాటుగా మానుకోట పోలీసులు ఓఅనాథ మహిళ మృత్యువాత పడగా ఆమె దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటారు. వివారాల్లోకి వెళితే.. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మూడు రోజుల క్రితం ఓ మహిళ వడదెబ్బ కు గురై సొమ్మసిల్లి పడిపోయింది. చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించింది. అప్పటి నుండి మార్చురీ లో ఆమె మృత దేహాన్ని భద్రపర్చగా, ఎవ్వరూ రాకపోవడం తో సోమవారం టౌన్ సిఐ వెంకట రత్నం, ఎస్సై సంతోష్ కుమార్, కానిస్టేబుల్ మోహన్ రాజులు అంత్యక్రియలు నిర్వహించారు.

Next Story

Most Viewed