- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పరకాల : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అఖిలపక్ష నేతలతో శనివారం జరిపిన చర్చలు విఫలమైనట్లేనా అనే చర్చ పరకాలలో విస్తృతంగా సాగుతోంది. పరకాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా జిల్లా సాధన ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం అఖిలపక్ష నేతలతో చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా జిల్లా పోరుకు ముగింపు పలికినట్లేనని అంతా అనుకున్నారు.
కానీ, అనుహ్యంగా అందుకు భిన్నంగా ఆదివారం పరకాల వరంగల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో.. అఖిలపక్ష నేతలు గౌడ కులస్తులను కలిశారు. అనంతరం జిల్లా సాధన ర్యాలీ చేపట్టడం కోసం అమరవీరుల మైదానం వద్ద బారి సమీకరణాలు జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే జరిపిన మంతనాలు విఫలం అయినట్లేనా..? అనే చర్చ పరకాల ప్రాంతంలో జోరందుకుంది.
Next Story