- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: గూగుల్కు భారీ షాక్ తగిలింది. గూగుల్తో స్థానిక వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతోంది అంటూ 2017లో యూరోపియన్ యాంటీట్రస్ట్ ఏకంగా 2.42 బిలియన్ యూరోల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసు వ్యవహారంలో బుధవారం విచారణ చేపట్టిన యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జనరల్ కోర్టు తిరస్కరించింది. ఈయూ కాంపిటీషన్ కమిషన్ ఫైన్ను సమర్థించింది. నిబంధనలకు విరుద్ధంగా ధరలను కంపేర్ చేస్తోందని.. ఓన్ షాపింగ్ సిఫార్సులను బలవంతంగా ఇంటర్నెట్ వినియోగదారులపై భారం వేయడంతో.. యూరప్లోని స్థానిక వ్యాపారులు నష్టపోతున్నట్టు ఈయూ యాంటీట్రస్ట్ తరఫున వాదనలు వినిపించారు. ఇరు వాదనలు పూర్తిగా విన్న యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జనరల్ కోర్టు గూగుల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో యూరప్ అత్యన్నత న్యాయస్థానం ఈయూ కోర్ట్ ఆఫ్ జస్టిస్కు వెళ్లేందుకు అవకాశం ఉంది. లేనిపక్షంలో 2.42 బిలియన్ యూరోలు(దాదాపు 21 వేల కోట్లు) చెల్లించాల్సిందే.!