నటుడు మురళీమోహన్‌కు భారీ షాక్.. క్రిమినల్ చర్యలు తప్పవా.!

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-14 09:03:37  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : సినీ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్‌కు భారీ ​షాక్. ఆయనకు సంబంధించిన జయభేరి నిర్మాణ సంస్థపై మాయని మచ్చ పడింది. దశాబ్దాల నిర్మాణ రంగంలోని సుదీర్ఘ అనుభవంలో తప్పులు దొర్లాయి. సొంత వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపధ్యంలోనే జయభేరి ప్రాపర్టీస్ ​ప్రైవేటు లిమిటెడ్​అనే సంస్థ అధినేత మురళీ మోహన్ హెచ్ఎండీఏ నిబంధనలను అతిక్రమించిన కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్‌లో జయభేరి [&hellip;]</p>

నటుడు మురళీమోహన్‌కు భారీ షాక్.. క్రిమినల్ చర్యలు తప్పవా.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : సినీ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్‌కు భారీ ​షాక్. ఆయనకు సంబంధించిన జయభేరి నిర్మాణ సంస్థపై మాయని మచ్చ పడింది. దశాబ్దాల నిర్మాణ రంగంలోని సుదీర్ఘ అనుభవంలో తప్పులు దొర్లాయి. సొంత వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపధ్యంలోనే జయభేరి ప్రాపర్టీస్ ​ప్రైవేటు లిమిటెడ్​అనే సంస్థ అధినేత మురళీ మోహన్ హెచ్ఎండీఏ నిబంధనలను అతిక్రమించిన కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్‌లో జయభేరి సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఫ్లాట్​విషయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని కోర్టును ఆశ్రయించారు.

ఈ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కొనుగోలుదారుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సినీ నటుడు మాగంటి మురళీమోహన్, బిజినెస్​ఎంటర్‌ప్రెన్యూర్​మాగంటి రామ్మోహన్, సంస్థ డైరెక్టర్​కిషోర్​దుగ్గిరాలపై వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు, మోసాలకు పాల్పడినందుకు సెక్షన్​406, 420 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2001 నుంచి 2007 వరకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొత్తగూడలో జయభేరి సిలికాన్​ కౌంటీ(జేఎస్సీ)ని నిర్మించారు. జయభేరి ప్రాపర్టీస్ ​ప్రైవేటు లిమిటెడ్​ సంస్థ పేరిట పలువురు ఐటీ ప్రొఫెషనల్స్, ఇతరులకు ఫ్లాట్లను విక్రయించారు. జయభేరికి ముందు ఎంఎం ఫైనాన్స్‌ర్స్ ​ప్రైవేటు లిమిటెడ్​ సంస్థగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అయితే 2003లో మధుసూదన్ ​బండ్రెడ్డి అనే వినియోగదారుడు జయభేరి సిలికాన్​ బెటా కాంప్లెక్సులో ఫ్లాట్ నం.203ని కోనుగోలు చేశారు. దాని విస్తీర్ణం 3010 చ.అ.లుగా ఉంది. అలాగే కారు పార్కింగ్ ​కూడా ఉంది. సేల్​డీడ్‌లో పలు అంశాలను పేర్కొన్నారు. కానీ, వాటిని అమలు చేయలేదు. చట్ట ఉల్లంఘనలు చేసినట్లు వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. 2‌‌‌‌‌‌‌‌008 డిసెంబర్ 18న మాదాపూర్ ​పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే ప్రమోషన్​ ఆఫ్​ కన్స్ట్రక్షన్​ అండ్ ​ఓనర్‌షిప్ ​యాక్టు 1987 కింద పోలీసులు దర్యాప్తు చేసి చార్జీ షీట్​దాఖలు చేశారు. 2009 నుంచి ట్రయల్స్​నడుస్తున్నాయి.

ట్రయల్​కోర్టులో ఇది సివిల్​అంశంగా పరిగణిస్తూ తీర్పు వెలువడింది. దీంతో వినియోగదారుడు హైకోర్టును ఆశ్రయించారు. సివిల్​ అంశాలతో పాటు క్రిమినల్ ​ఛార్జెస్​ ఫ్రేమ్ ​చేయాల్సిందేనని, వినియోగదారులను మోసగించినట్లుగా తెలుస్తున్నదని జస్టిస్ ​దుర్గాప్రసాద్​ తీర్పు నిచ్చినట్లుగా హైకోర్టు న్యాయవాది పీఎన్​ప్రవీణ్​కుమార్​ మంగళవారం ‘దిశ’కు వివరించారు. దీనిపై జయభేరి సంస్థ ప్రతినిధులు స్పెషల్​ లీవ్​పిటిషన్ ​దాఖలు చేశారు. తాజాగా జయభేరి ప్రతినిధులు సమర్పించిన క్రిమినల్​ స్పెషల్​ లీవ్ ​పిటిషన్‌ను డిస్మిస్​ చేశారు. సేల్ డీడ్‌లో ప్రస్తావించిన ప్రతీ అంశాన్ని అమలు చేయాల్సిందేనని ట్రయల్​ కోర్టు స్పష్టం చేసింది. దీన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్​ చర్యలు తప్పవని హెచ్చరించింది. అనేక ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లుగా కనిపిస్తుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడినట్లు న్యాయవాది చెప్పారు. అపార్ట్‌మెంట్​ యాక్టును ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది.

యూడీఎస్‌లో తేడాలు..

జయభేరి సంస్థ దాఖలు చేసిన స్పెషల్​లీవ్​పిటిషన్‌ను న్యాయస్థానం సునిశితంగా పరిశీలించింది. మొదటి సాంక్షన్​ప్లాన్, రెండో సాంక్షన్​ప్లాన్‌కు మధ్య తేడాలున్నాయి. దీంతో, ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు లభించే స్థలం(అన్​డివైడెడ్​షేర్​ఆఫ్​ల్యాండ్)లో చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే వినియోగదారులకు వివరించలేదు. పైగా సేల్​డీడ్‌లో ప్రస్తావించిన వాటిని వినియోగదారులకు సమకూర్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఇన్నేండ్లుగా నిర్మాణ రంగంలో ప్రత్యేక ఒరవడిని కలిగిన జయభేరి సంస్థకు తొలిసారి షాక్​తగిలింది. ఐతే సుదీర్ఘ కాలంగా జరిగిన విచారణలో వినియోగదారులకే అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం.

సేల్​డీడ్ ​అంశాలు.. ఉల్లంఘనలు

మెయిన్​రోడ్డుకు పక్కన 7,322 చ.గ.ల ఖాళీ స్థలాన్ని చూపించారు. కానీ, దాన్ని జేఎస్టీ రియాల్టీ లిమిటెడ్(గతంలో డీహెచ్ఎఫ్ఎల్)కు 2005 లో విక్రయించారు. అలాగే 2007లో జయభేరి సిలికాన్​టవర్స్‌ను నిర్మించారు. డ్రైవ్​వే 24 అడుగులు అని చెప్పారు. కానీ దాన్ని 16 అడుగులకు పరిమితం చేశారు. హుడా ఆమోదించిన ప్రొసిడింగ్స్​నం.జి/229/ఎల్పీ/2718/98, తేదీ.3.12.1999 ని ఉల్లంఘించినట్టు అయ్యింది. మూడు టవర్లు ఆల్ఫా, బీటా, గామాలతో పాటు జయభేరి సిలికాన్‌ల పేరిట నిర్మించారు. 18,521 చ.గ.ల్లో నిర్మించినట్లుగా సేల్ డీడ్‌లో ఉంది.

కానీ, అది 16,568.045 చ.గ.లకు పరిమితం చేశారు. వినియోగదారుడు మధుసూదన్​బండ్రెడ్డి సర్వే ఇది ప్రకారం తేలింది. అంటే ఏకంగా 1953 చ.గ.ల స్థలాన్ని తగ్గించారు. ఉత్తరం దిక్కున 3,197 చ.గ.ల్లో క్లబ్​నిర్మించారు. సేల్​డీడ్‌లో క్లబ్​హౌజ్‌తో పాటు ఎస్టీపీ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. కానీ, ఎస్టీపీ ఫ్లాట్ల యజమానుల సొంతం కాని దాన్ని జయభేరి సిలికాన్​టవర్స్‌కు బదిలీ చేశారు. కేవలం వినియోగించుకునేందుకు పరిమితం చేశారు.

తీర్పును అంగీకరిస్తాం : దుగ్గిరాల కిషోర్, డైరెక్టర్, జయభేరి ప్రాపర్టీస్ ​ప్రైవేటు లిమిటెడ్​

సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నాం. జస్టిస్​ విల్​ ప్రివెయిల్. 162 మంది సమూహంలో ఒకరిద్దరు అసంతృప్తికి గురయ్యారని అన్నారు.

Follow Dishadaily official Facebook Page : https://www.facebook.com/dishatelugunews

Jayabheri Flats

Next Story