- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంలో కూడా భారత్ ఆర్థికంగా నష్టపోతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. కరోనా సమయంలో స్కూళ్లు మూసివేయడంతో భారత్ 400 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం కోల్పోయిందనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికి వెల్లడించింది.
“బీటెన్ ఆర్ బ్రోకెన్” పేరుతో విడుదలైన వరల్డ్ బ్యాంకు నివేదిక ప్రకారం.. కరోనా సమయంలో పాఠశాల మూసివేయడం వల్ల భారత్ భవిష్యత్ ఆదాయాన్ని రూ.31.50 లక్షల కోట్ల నుంచి రూ.43.86 లక్షల కోట్ల వరకు కోల్పోనుంది. పైగా 50 లక్షల మంది విద్యార్థుల్లో చదవాలన్న లేదా నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోవచ్చని పేర్కొంది. అదే దక్షిణాసియా ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిలో 662 నుంచి 880 బిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూడవచ్చని స్పష్టం చేసింది. పాఠశాలలో చేరిన వారితో పోలిస్తే డ్రాపౌట్స్ కారణంగా దక్షిణాసియాకు భవిష్యత్తు ఆదాయాలు, స్థూల జాతీయోత్పత్తిలో రూ.46.65లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని నివేదికలో పేర్కొంది.