భూ వివాదంలో కలెక్ట‌ర్‌కు హెచ్చార్సీ నోటీసులు

by  |
భూ వివాదంలో కలెక్ట‌ర్‌కు హెచ్చార్సీ నోటీసులు
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ గౌత‌మ్‌కు మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ నుంచి నోటీసులు అందాయి. భూ వివాదంలో త‌న‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని య‌ల‌మంచిలి వెంక‌టేశ్వ‌ర్లు అనే వ్య‌క్తి మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించాడు. అందులో క‌లెక్ట‌ర్ గౌతమ్‌ను ప్ర‌తివాదిగా పేర్కొన్నాడు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి విచార‌ణ‌కు జూలై నెల 20వ తేదీన హైద‌రాబాద్‌లోని కార్యాల‌యానికి రావాల‌ని క‌లెక్ట‌ర్ గౌత‌మ్‌కు క‌మిష‌న్ మంగ‌ళ‌వారం నోటీసులు జారీ చేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed