వర్షం మిగిల్చిన విషాదం.. నిరాశ్రయురాలైన ఒంటరి మహిళ

by  |
వర్షం మిగిల్చిన విషాదం.. నిరాశ్రయురాలైన ఒంటరి మహిళ
X

దిశ, సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ ఆవరణలో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి విశ్వనాధుల సావిత్రి ఇల్లు గురువారం ఉదయం కూలిపోయింది. బాధితురాలు సావిత్రి మాట్లాడుతూ.. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అధికారులు తక్షణమే ఆర్థిక సాయం అందించాలన్నారు. తాను ఒంటరిగా జీవితం గడుపుతుండటంతో ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నానని, ప్రభుత్వం వెంటనే ఆదుకొని న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.


Next Story

Most Viewed