Shani : 30 యేళ్ల తర్వాత శని దేవుడితో శుక్రుడి కలయిక.. ఆ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..

by Prasanna |
Shani : 30 యేళ్ల తర్వాత శని దేవుడితో శుక్రుడి కలయిక.. ఆ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ప్రస్తుతం, శనిదేవుడు కుంభ రాశిలో ఉన్నాడు. నవగ్రహాల్లో శుక్రుడు, శని దేవుడు మంచి స్నేహితులు. దాదాపు 30 యేళ్ల తర్వాత శని దేవుడితో శుక్రుడు కలవబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవం ఆడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మిథున రాశి : శుక్ర, శని దేవుడు గ్రహాల కలయిక వల్ల మిథున రాశి వారికి జీవితమే మారిపోబోతుంది. ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారు శని దేవుని అనుగ్రహం వలన రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్న పనులన్నీ సాధిస్తారు. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ విపరీతంగా లాభాలు వస్తాయి. కోర్టు సమస్యల్లో ఇరుక్కున్న వారు వాటి నుంచి బయటపడతారు. అలాగే, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి : ఈ రాశి వారికీ శుక్ర, శని గ్రహాల కలయిక వలన ఆకస్మిక ధనలాభంతో పాటు.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అలాగే, విదేశాలకు వెళ్లాలనునే వారి కల నెరవేరుతుంది. మీరు మొదలు పెట్టిన పనులలో మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ దొరుకుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ మారుతుంది. మీ వల్ల సహాయం పొందిన వారు మీ వద్దకే తిరిగి వస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed