30 ఏళ్ల తర్వాత గ్రహాల కలయిక.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!

by Dishanational2 |
30 ఏళ్ల తర్వాత గ్రహాల కలయిక.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో గ్రహాల ఆగమనం, కలయిక జరుగుతుంటుంది. దీంతో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల మీద వీటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కొన్ని రాశుల వ్యక్తులకు ఆర్థికంగా కలిసి వస్తే, మరొన్ని రాశులకు నష్టాలు, అశుభ ఫలితాలు ఏర్పడుతుంటాయి.అయితే ప్రస్తుతం 30 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక జరుగుతుంది. దీని ప్రభావంతో మూడు రాశుల వారికి ఆరోగ్యం పంరంగా, ఆర్థికంగా పట్టిందల్లా బంగారం కానుంది. ఆ రాశులు ఏంటివి, వాటిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : గ్రహాల కలయిక ద్వరా ఈరాశి వారి ఆదాయం ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. 30 సంవత్సరాల తర్వాత శని, మెర్క్యూరీ కలయిక నుంచి ప్రయోజనం పొందుతుంది. ఈ యోగం వలన 11 వ ఇంట మేష రాశి వారికి ఆదాయ, లాభ గృంలో ఏర్పడుతుంది. దీని ప్రభావంతో వ్యాపారంలో కలిసి రావడమే కాకుండా, పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.

వృషభ రాశి : 30 ఏళ్ల తర్వాత, శని, బుధ గ్రహాలు కలయిక వలన వృషభ రాశి వారికి ఉద్యోగవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పదోన్నతి లభిస్తుంది. కొత్త వెంచర్లకు ప్రణాళిక వేయనున్నారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. జూనియర్లకు తమ ఆఫీసులో పదోన్నతి లభించే అవకాశం ఉంది.

మిథున రాశి : మిథునరాశి వారికి అదృష్ట గృహంలో బుధుడు, శని సంయోగం ఉన్నట్లయితే, ఈ సంయోగం మీకు సానుకూలంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది, ఈ సమయంలో మిథున రాశి వారికి అదృష్ట శోభలు లభిస్తాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగే సమయం ఇది.నిరుద్యోగులకు కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి వివాహం గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కలసి వస్తుంది.


ఇవి కూడా చదవండి :

Budha : బుధుడు అస్తమించడం వలన ఈ రాశుల వారికి డబ్బే డబ్బు!

Next Story

Most Viewed