ఇంటి అద్దె వివాదం.. దంపతుల ఆత్మహత్యాయత్నం

by  |
ఇంటి అద్దె వివాదం.. దంపతుల ఆత్మహత్యాయత్నం
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఇంటిఅద్దె వివాదం దంపతుల ఆత్మహత్యాయత్నం దాకా దారి తీసింది. శుక్రవారం మండల కేంద్రంలో గోల్డ్ స్మిత్ దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్న చంద్రమౌళి, సౌమ్యశ్రీ దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిని నిర్మల్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. రూమ్ రెంట్ కు సంబంధించి ఇంటి ఓనర్ తో డబ్బుల విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోన్నది. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కాగా లాక్ డౌన్ సమయంలో ఇంటి అద్దె విషయంలో యజమానులు సతాయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed