చంద్రబాబుకు సవాల్ విసిరిన హోంమంత్రి

by  |
చంద్రబాబుకు సవాల్ విసిరిన హోంమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోదంటూ ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాయడంపై హోంమంత్రి సుచరిత స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజం లేదని, సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతుంటే బురద చల్లడానికే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మోడీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు కీర్తిస్తున్నారని, కుట్రలను ప్లాన్ ప్రకారం చేస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ జరుగుతుందని పత్రికల్లో వార్తను రాస్తారని ఫైర్ అయ్యారు. తమకు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని, ఏమైనా ఆధారాలుంటే డీజీపికి ఇవ్వాలని పేర్కొన్నారు. లేకుంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.


Next Story

Most Viewed