- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: లాక్డౌన్లో వలస కూలీలు, పేదలకు సేవలందించిన ఉప్పల ఫౌండేషన్ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గురువారం హోంమంత్రిని లక్డీకాపూల్లోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, లాక్డౌన్ విధించిన నాటి నుండి ఉప్పల ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. నిత్యం 2వేలమందికి అన్నదానం, నిత్యావసరాల పంపిణీతో పాటు జర్నలిస్టులకు, పోలీసులకు కరోనా కిట్లు అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం హోంమంత్రి ఆఫీస్లోని సిబ్బందికి కరోనా సేఫ్ గార్డ్, శానిటైజర్, గ్లోవ్స్, మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ కరోనా కిట్ను పరిశీలించి ప్రశంసించారు. ఉప్పల ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలను మెచ్చుకున్నారు. సామాజిక బాధ్యతగా సేవాభావంతో ఎంతోమంది ఆకలి తీర్చడం గొప్ప విషయమంటూ శ్రీనివాస్ను అభినందించారు.