శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి

by  |
శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ట్రైనింగ్ పూర్తయిన కానిస్టేబుళ్లకు పేట్ల బురుజు గ్రౌండ్స్‌లో బుధవారం పాస్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే.. విద్యుత్, లా అండ్ ఆర్డర్, తీవ్రవాదం సమస్యలు వస్తాయని ప్రచారం చేశారన్నారు. కానీ రాష్ట్రం అద్భుతమైన పురోగతితో ముందుకెళ్తుందన్నారు. దేశంలోనే 64శాతం సీసీ కెమెరాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. పోలీసుశాఖ అభివృద్దికి వేల కోట్ల రూపాలను కేటాయించామని, కొత్త వాహనాలకు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. 17వేల పోస్టులలో ప్రస్తుతం 10వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed