బస్సు ఢీకొని… హోంగార్డు దుర్మరణం

by  |
బస్సు ఢీకొని… హోంగార్డు దుర్మరణం
X

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద బైక్‌ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు చిట్టెంశెట్టి నరసింహ రావుగా గుర్తించారు. విధి నిర్వాహణలో భాగంగా నేలకొండపల్లి నుంచి కోదాడ వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది.


Next Story

Most Viewed