ఏపీ రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు రద్దు

by  |
ఏపీ రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు రద్దు
X

దిశ, అమరావతి: కరోనా వైరస్‌ ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఏడాది రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలను రద్దు చేస్తున్నట్లు గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. ఈ నెల 10న హోలీ పండుగ ఉన్న నేపథ్యంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా సామూహిక కార్యక్రమాలకు స్వస్తి పలుకుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ కార్యాలయ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.


Next Story