నిలకడగా దత్తాత్రేయ ఆరోగ్యం

by  |
నిలకడగా దత్తాత్రేయ ఆరోగ్యం
X

దిశ, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు అపోలో హాస్పిటల్ ఎండీ సంగీతారెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సాధారణ వైద్య పరీక్షలు నిమిత్తం దత్తాత్రేయ హైదర్ గూడ హాస్పిటల్‌కు వచ్చారన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు పర్యవేక్షణ‌లో గత 15 ఏళ్లుగా ఆయన వైద్య సేవలు పొందుతున్నట్టు సంగీతారెడ్డి తెలిపారు. మరో గంటలో డిశ్చార్జ్ అవుతారని, సోమవారం సాయంత్రం సిమ్లా వెళ్లనున్నట్టు దత్తాత్రేయ వ్యక్తిగత సలహాదారు కైలాష్ నాగేష్ తెలిపారు.

tag; himachal pradesh governor, dathatreya, apolo hospital, md, sangeetha reddy



Next Story

Most Viewed