కాంగ్రెస్‌లో విషాదం.. సీనియర్ నేత మృతి

by  |
Himachal ex-CM Virbhadra Singh passes away at 87
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో విషాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ (87) అనారోగ్య సమస్యలతో గురువారం తెల్లవారు జామున మ‌ృతి చెందారు. సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటూ ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కాగా వీరభద్ర సింగ్ కాంగ్రెస్‌ తరఫున తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌కు ఆయన నాలుగో ముఖ్యమంత్రిగా పని చేశారు. అప్పటి నుంచి ఆరుసార్లు ఆయన సీఎంగా సేవలందించారు.

Next Story