నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు

by  |
nagarjuna-sagar
X

దిశ, వెబ్‌డెస్క్ : మాచర్లలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ వద్ద భారీగా రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు మోహరించారు. సాగర్ జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థా్యిలో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో, తక్షణమే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులను పోలీసులు సరిహద్దు వద్దనే అడ్డుకున్నారు.

పోలీసులు సాగర్‌లోకి ఏపీ అధికారులను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వినతి పత్రం తీసుకునేందుకు తెలంగాణ జెన్కో అధికారులు నిరాకరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story