టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టులో చుక్కెదురు

by  |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టులో చుక్కెదురు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు హైకోర్టులో నిరాశ ఎదురయ్యింది. ఓటుకు నోటు కేసు నుంచి సండ్ర వెంకట వీరయ్యను తొలగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఓటుకు నోటు కేసులో డిశ్చార్జ్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు విచారణ జరుగుతోంది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరయ్యారు. ఈ నెల 15వ తేదీన కచ్చితంగా హాజరు కావాలని నిందితులందరికీ ఏసీబీ కోర్టు ఆదేశించింది. హాజరు మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించమని కోర్టు స్పష్టం చేసింది.

Next Story

Most Viewed