సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే

by  |
High court
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు నిలిచిపోయాయి. కూల్చివేత పనులు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, డాక్టర్ చెరుకు సుధాకర్‌ వేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలోనే మరో రెండు రోజుల పాటు (జులై 15) స్టే పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అయితే, భవనాల కూల్చివేత అనుమతులపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో కోర్టు కేబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఏజీని ఆదేశించడంతో.. సాయంత్రం వరకు సమర్పిస్తామని ఆయన బదులు ఇచ్చారు. ఈ పరిణామాలతో విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది.


Next Story