ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపాలని ఆదేశాలు

by  |
ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపాలని ఆదేశాలు
X

దిశ, వెబ్‎డెస్క్ : తెలంగాణలో నేడు జరగాల్సిన ఎంసెట్ రెండో ఫేజ్ కౌన్సెలింగ్ ఆపాలని జేఎన్‎టీయూకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం… పాస్ మార్కులు వేసి అందరినీ ఉత్తీర్ణులను చేసింది. కాగా, ఎంసెట్‌ రాయాలంటే ఇంటర్మీడియట్‌లో 45శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం విస్మరించింది.

ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా.. ఎంసెట్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం త్వరలో జీవో జారీ చేస్తుందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. కాగా, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిపివేయాలని జేఎన్‎టీయూను ధర్మాసనం ఆదేశించింది.



Next Story

Most Viewed