- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. టికెట్ ధరలను తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకాలు జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సినిమా టికెట్ల ధరలపై డివిజన్ బెంచ్లో ఏపీ సర్కార్ అప్పీల్ చేయడంతో గురువారం విచారణ జరిగింది.
జగన్ సర్కార్ తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ల యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుకు తీసుకు రావాలని ఆదేశించింది. ధరలపై వారి నిర్ణయమే ఫైనల్ అని, టికెట్ ధరలపై ప్రభుత్వమే ఓ కమిటినీ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.