- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఓట్ల లెక్కింపును రికార్డింగ్ చేయించాలని కోరుతూ.. కుప్పం టీడీపీ అభ్యర్థులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు స్వీకరించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావులు వాదనలు వినిపించారు.
ఇరు వాదనలు విన్న హైకోర్టు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ ఆఫిసర్ ఎన్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఓట్ల లెక్కింపును రికార్డింగ్ చేయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. కౌటింగ్ వీడియో రికార్డింగ్ను సోమవారం హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
Next Story