విశాఖలో గెస్ట్ హౌస్ : హైకోర్టు కీలక ఆదేశాలు

by  |
విశాఖలో గెస్ట్ హౌస్ : హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, విశాఖపట్నం: విశాఖ నగరంలోని కాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. గెస్ట్​హౌస్​కు కేటాయించిన 30 ఎకరాల్లో ఉన్న చెట్లు నరకవద్దని, అతిథిగృహం నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రేహౌండ్స్​కు ఇచ్చిన స్థలంలో అతిథిగృహం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదించారు. గ్రేహౌండ్స్ నక్సల్స్, టెర్రరిస్ట్ వ్యతిరేక దళం, రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

Next Story

Most Viewed