సర్కార్‌కు ఊరట.. గురుకులాల ఓపెన్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

by  |
TS-High-Court
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 1న స్కూల్స్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థులకు కరోనా సోకే అవకాశం ఉందని హైకోర్టు గురుకులాల్లో భౌతిక తరగతుల నిర్వహణకు నిరాకరించింది.

ఈ క్రమంలో ఇంటర్‌ పరీక్షల దృష్ట్యా గురుకులాలను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరగా.. గురుకుల పాఠశాలలను తిరిగి తెరిచేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విద్యా సంస్థల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ ప్రసాద్‌ హైకోర్టుకు తెలుపగా కోర్టు గత ఆదేశాలను సవరించింది. దీంతో గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్‌లైన్‌ బోధనకు అనుమతి లభించింది.

Next Story

Most Viewed