హైకోర్టులో నీలం సాహ్నికి ఊరట

by  |
Neelam Sahni
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్నిని ప్రభుత్వం ఎస్ఈసీగా నియమించింది. సీఎస్‌గా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎస్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన వెంటనే ఎస్ఈసీగా నియమితులవ్వడం అంటే రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నీలం సాహ్ని నియామకం చెల్లదని వాదించారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలని, తిరిగి వారి స్థానంలో కొత్తవారిని నియమించేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో హైకోర్టు విభేదించింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం సరైనదేనని అభిప్రాయపడింది. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన అనేది జరగలేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.



Next Story