హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు

by  |
హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టులో జగన్ సర్కారుకు మరోసారి చుక్కెదురు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆపలేమని స్పష్టం చేసింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది.


Next Story

Most Viewed